కవాడిగూడ : కరోనా నియంత్రణలో ఫ్రంట్లైన్ వారియర్స్గా పనిచేసిన ఆశా వర్కర్ల సేవలు మరువలేనివని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు.
ఈ మేరకు మంగళవారం కవాడిగూడ డివిజన్ డీబీఆర్ మిల్స్, భోలక్పూర్, ముషీరాబాద్ యూపీహెచ్సీ సెంటర్లలో రాష్ట్ర వైద్యా ఆరోగ్యశాఖా మంజూరి చేసిన స్మార్ట్ ఫోన్లను 43 మంది ఆశా వర్కర్లకు ఆయన అంబర్పేట క్లస్టర్ ఎస్పీఎం డాక్టర్ హేమలత, ఆర్బీఎస్కే డాక్టర్ అనిల్, డాక్టర్ మౌనిక, యూపీహెచ్సీ వైద్యాధికారులు డాక్టర్ కృష్ణమోహన్ రావు, డాక్టర్ రవిలతో కలిసి పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే ముఠా గోపాల్ మాట్లాడుతూ భోలక్పూర్, ముషీరాబాద్ యూపీహెచ్సీ సెంటర్లకు-35, డీబీఆర్ యూపీహెచ్సీ సెంటర్కు-18 స్మార్ట్ ఫోన్లను అందజేయడం జరిగిందని అన్నారు. ప్రజలకు మెరుగైన వైద్యం అందించేందుకు ఆశా వర్కర్లకు రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన స్మార్ట్ ఫోన్లు ఎంతో దోహదపడుతాయని అన్నారు.
ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ కవాడిగూడ డివిజన్ అధ్యక్షుడు వల్లాల శ్యామ్ యాదవ్, మాజీ అధ్యక్షులు కల్వ గోపీ, రాంచందర్, నాయకులు రాజశేఖర్ గౌడ్, ముచ్చకుర్తి ప్రభాకర్, తదితర ఆశా వర్కర్లు పాల్గొన్నారు.