బంజారాహిల్స్/బేగంపేట్/బన్సీలాల్పేట్,డిసెంబర్ 29: జీహెచ్ఎంసీ సర్కిల్ -18 పరిధిలో రెండో రోజు ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం కొనసాగింది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, వెంకటేశ్వరకాలనీ, షేక్పేట డివిజన్ల పరిధిలో ఏర్పాటు చేసిన 16 కౌంటర్లలో అభయహస్తం పథకాల కోసం దరఖాస్తులను స్వీకరించారు.
బన్సీలాల్పేట్ డివిజన్లోని చాచా నెహ్రూనగర్లో ఏర్పాటు చేసిన ప్రజా పాలన అభయహస్తం దరఖాస్తుల స్వీకరణ కేంద్రాన్ని టీ.పీసీసీ కార్యదర్శి మర్రి ఆదిత్యారెడ్డి సందర్శించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎన్ విఠల్, నారాయణ, శ్రీనివాస్, డాక్టర్ శివకుమార్లాల్, కే హేమలతా, జగదీష్, సురేశ్, రాజేందర్, దశరథ్, మాజీ కార్పొరేటర్ ఆయూబ్ఖాన్ తదితరులు పాల్గొన్నారు.