మాదాపూర్, జనవరి 11: నిఘానేత్రాలతోనే నేరాలను అదుపు చేయవచ్చని స్థానిక ఎమ్మెల్యే, విప్ అరెకపూడి గాంధీ అన్నారు. ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని తులసీనగర్ కాలనీలో ఎమ్మెల్యే సీడీపీ నిధులతో కాలనీ అసోసియేషన్ ఆధ్వర్యంలో రూ.3.70 లక్షల వ్యయంతో కార్పొరేటర్ దొడ్ల వెంకటేశ్ గౌడ్, రోజాదేవి రంగారావు, సీఐ సైదులు, ఎస్సై శ్రీకాంత్తో కలిసి బుధవారం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా విప్ గాంధీ మాట్లాడుతూ.. సీసీ కెమెరాల ఏర్పాటుకు తులసీనగర్ కాలనీవాసులు ముందుకు రావడం అభినందనీయమని అన్నారు. డివిజన్లోని అన్ని కాలనీల ప్రతినిధులు వారి కాలనీలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకొని ఇతరులకు ఆదర్శం కావాలన్నారు. కాలనీలో అదనపు కెమెరాల ఏర్పాటుకు అవసరమైతే తన వంతు ఆర్థిక సహాయం చేస్తానన్నారు. సీసీ కెమెరాల ఏర్పాటుకు తనవంతు కృషిగా రూ.1 కోటిని కేటాయించడం జరిగిందన్నారు. మహిళలు, ప్రజల రక్షణ, దొంగతనాలు అరికట్టడానికి సీసీ కెమెరాల పాత్ర కీలకమని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆల్విన్ కాలనీ డివిజన్ అధ్యక్షుడు సమ్మారెడ్డి, మాదాపూర్ డివిజన్ బీఆర్ఎస్ అధ్యక్షుడు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, కాశీనాథ్, మోజెస్, తులసి, రామకృష్ణ, చంద్రశేఖర్రెడ్డి, శ్రీనివాస్, సుకుమార్, ప్రశాంత్, నరేశ్, సత్యనారాయణ, రాజు తదితరులు పాల్గొన్నారు.
సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ
శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని పలువురు వైద్య చికిత్స ఖర్చుల నిమిత్తం దవాఖానా బిల్లుల పరిహారార్థం సీఎం సహాయనిధికి దరఖాస్తు చేసుకోగా సీఎంఆర్ఎఫ్ ద్వారా మంజూరైన రూ.12,08,500 లక్షల ఆర్థిక సహాయానికి సంబంధించిన సీఎంఆర్ఎఫ్ చెక్కులను బుధవారం స్థానిక ఎమ్మెల్యే, విప్ అరెకపూడి గాంధీ ఆయన నివాసంలో కార్పొరేటర్ దొడ్ల వెంకటేశ్ గౌడ్, నార్నె శ్రీనివాస్రావు, మాజీ కార్పొరేటర్ కొత్త రామారావు, మాధవరం రంగారావుతో కలిసి పలువురు లబ్ధిదారులకు అందజేశారు.
గేటర్ హైదరాబాద్ మున్నూరు కాపు సంఘం జనరల్ సెక్రటరీగా ఎన్నికైన పెరుక రమేశ్ పటేల్ బుధవారం హఫీజ్పేట్ మున్నూరు కాపు నాయకులతో కలిసి విప్ గాంధీ నివాసంలో మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ నేపథ్యంలో స్థానిక ఎమ్మెల్యే, విప్ గాంధీ శాలువాతో సన్మానించి అభినందించారు.