జవహర్నగర్, అక్టోబర్ 24: ఎన్నికలు పారదర్శకంగా, సజావుగా జరిగేందుకు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నామని, పౌరులు స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకోవాలని మల్కాజిగిరి డీసీపీ జానకి సూచించారు. శాంతియుతంగా ఎన్నికలను నిర్వహించుకుందామని డీసీపీ ఆధ్వర్యంలో సెంట్రల్ఫోర్స్, జవహర్నగర్ పోలీసులు సంయుక్తంగా దమ్మాయిగూడ నుంచి జవహర్నగర్ మున్సిపల్ కార్యాలయం వరకు ఫ్లాగ్ మార్చ్ కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా డీసీపీ జానకి మాట్లాడుతూ… డబ్బు, మద్యం అక్రమ తరలింపుపై స్పెషల్ ఫోకస్ పెట్టామని, బెల్ట్ షాపులు లేకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకోవాలని, ఎన్నికల నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అదనపు డీసీపీ వెంకటరమణ, కుషాయిగూడ ఏసీపీ రవీందర్, జవహర్నగర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ సీతారాం,ఎస్సైలు అనిల్కుమార్ యాదవ్, అనిల్ కుమార్రెడ్డి, లక్ష్మణ్, వేణుమాదవ్, పోలీసులు పాల్గొన్నారు.