ఆర్కేపురం : కష్టపడే వ్యక్తులకు బీఆర్ఎస్ పార్టీలో సముచిత స్థానం ఉంటుందని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి (Minister Sabitha Reddy ) అన్నారు. గురువారం ఆర్కేపురం డివిజన్ ఎన్టీఆర్నగర్ ఫేస్ టు లో నివాసముండే బీజేపీ (BJP) కి చెందిన కార్యకర్తలు బీఆర్ఎస్ (BRS) పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారికి శాలువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
మంత్రి మాట్లాడుతూ పార్టీని మరింత బలోపేతం చేసేందుకు కృషి చేయాలని సూచించారు. పార్టీ ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలు ఇంటింటికి చేరవేయాలని కోరారు. మహేశ్వరం అభివృద్ధి మంత్రి సబితా ఇంద్రారెడ్డితో సాధ్యమని గ్రహించి మద్దతు తెలుపుతూ బీఆర్ఎస్లో చేరామని వెల్లడించారు. పార్టీకోసం నిరంతరం కష్టపడుతామని, రాబోవు రోజుల్లో మూడోసారి ప్రభుత్వం ఏర్పడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో మహేశ్వరం నియోజకవర్గం జనరల్ సెక్రటరీ మురుకుంట్ల అరవింద్శర్మ, ఆర్.కె.పురం పార్టీ అధ్యక్షులు పెండ్యాల నాగేష్, సాజిద్, లాల్ మహ్మద్, గొడుగు శ్రీనివాస్, రామాచారి, లింగస్వామి గౌడ్, కంచర్ల శేఖర్, జగన్మోహన్రెడ్డి, పెంబర్తి శ్రీనివాస్రెడ్డి, కొండ్ర శ్రీనివాస్, వెంకటేష్గౌడ్, శ్రీరాములు, రమేష్ కురుమ, దేవేందర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.