అడ్డగుట్ట, ఫిబ్రవరి 4 : ఆదివారం తెల్లవారుజామున మెట్టుగూడ ప్రధాన రోడ్డుపై రెడీమిక్స్ వాహనం బీభత్సం సృష్టించింది. నాచారం ప్లాంట్ నుంచి హైటెక్ సిటీలో నిర్మాణానికి లోడ్తో వెళ్తున్న రెడ్మిక్స్ వాహనం డ్రైవర్ నిర్లక్ష్యంగా మితిమీరిన వేగంతో దూసుకువచ్చి డివైడర్ను ఢీకొట్టి పల్టీ కొట్టింది. ఆ సమయంలో ట్రాఫిక్ రద్దీ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.
సమాచారం అందుకున్న చిలకలగూడ ట్రాఫిక్, లా అండ్ ఆర్డర్ పోలీసులు అక్కడికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. అప్పటికే డ్రైవర్ అక్కడి నుంచి పారిపోయాడు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని పోలీసులు తెలిపారు. వాహన డ్రైవర్పై కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.