హైదరాబాద్ : మెట్టుగూడ(Mettuguda)లో లారీ బీభత్సం సృష్టించింది. మెట్టుగూడజాతీయ రహదారిపై ఆదివారం వేకువ జామున ఉదయం 5:25 నిమిషాలకు ఒక్కసారిగా శబ్దం రావడంతో మెట్టుగూడా పరిసర ప్రాంత ప్రజలు భయాందోళనకు గురయ్యారు. మెట్టుగూడ మెయిన్ రోడ్ రైల్వే ఆఫీసర్స్ క్లబ్ వద్ద నాచారం ప్లాంట్ నుంచి హైటెక్ సిటీ కన్స్ట్రక్షన్ సైట్ కి లోడుతో వెళ్తున్న రెడ్ మిక్స్ లారీ(Readymix lorry) డ్రైవర్ నిర్లక్ష్యంతో అదుపుతప్పి డివైడర్ను ఢీ కొట్టి పల్టీ కొట్టింది.
డ్రైవర్ లారీని వదిలేసి పారిపోయాడు. సమాచారం అందుకున్న చిలకలగూడ ట్రాఫిక్ ఎస్ఐ శ్రీధర్ శేఖర్ ఆధ్వర్యంలో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని ట్రాఫిక్ క్లియర్ చేశారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. ఎలాంటి ప్రాణ, ఆస్థినష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.