మేడ్చల్, జనవరి 14 (నమస్తే తెలంగాణ) : రైతు బంధు పథకం ప్రతి రైతుఇంటా.. పదిరోజుల ముందే సంక్రాంతి సంబురాన్ని నింపిందని, ఆ ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందని మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. కేంద్ర ప్రభుత్వ ప్రజా, రైతు వ్యతిరేక విధానాలను ప్రజలు భోగి మంటల్లో కాల్చేశారని చెప్పారు. యావత్ తెలంగాణ ప్రజానీకం ముఖ్యమంత్రి కేసీఆర్వైపే ఉండటంతో ప్రతిపక్షాలు జీర్ణించుకోలేక పోతున్నాయని విమర్శించారు. తెలంగాణ ప్రజలు సుఖశాంతులతో, ఆయురార్యోగాలతో ఉండాలని ఆకాంక్షిస్తూ.. సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలిపారు.