చంపాపేట, సెప్టెంబర్ 02 : స్వామి వివేకానంద మార్గం అనుసరణీయమని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి అన్నారు. చంపాపేట డివిజన్ పరిధిలోని మారుతి నగర్ కాలనీ పార్కులో విగ్రహ దాత ఇజాప ఆనంద్ కుమార్ సహకారంతో అ కాలనీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ప్రతిష్టించిన వివేకానంద విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. స్వామి వివేకానంద ఆశయాలు దేశానికి మార్గదర్శనమన్నారు. ఆయన కళలు గన్న సమాజ స్థాపనకై ప్రతి ఒకరు కృషి చేయాలన్నారు.
ప్రధానంగా యువత ఆయన ఆశయాలను ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని సూచించారు. విగ్రహం ఏర్పాటుతోనే అంతా అయిపోయిందని వదిలేస్తే సరైంది కాదు. ఆయన ఆశయ సాధన కోసం అందరు పాటుపడి పని చేయాలన్నారు.
కార్య్రకమంలో కాలనీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు నాగపురి నర్సింహా చార్యులు, కార్యదర్శి జి సుధాకర్, కోశాధికారి పురుషోత్తం రెడ్డి, సంఘం ప్రతినిధులు పసునూరి జైపాల్ రెడ్డి, గుమ్మకొండ రఘునందన్ రెడ్డి, సుధాకర్ రెడ్డి, మురళిదర్ రెడ్డి, మణికొండ రమేష్, సంధ్య, విజయ, రాంచందర్ రావు, ధర్మపురి, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు నల్ల రఘుమారెడ్డి, గూడూరు గౌతంరెడ్డి, నిష్కాంత్రెడ్డి, ముడుపు రాజిరెడ్డి, అనసూయ, మాధవిరెడ్డి, బైగళ్ల రాము, ప్రభాకర్, జంగయ్య తదితరులు పాల్గొన్నారు.