సిటీబ్యూరో, జనవరి 20(నమస్తే తెలంగాణ): తెలంగాణ ప్రభుత్వం చారిత్రక, సాంసృతికంగా ఎంతో ఘన చరిత్ర కలిగిన హైదరాబాద్ మహా నగరంలో ప్రముఖ వారసత్వ కట్టడాలను పునరుద్ధరించి, భావి తరాలకు అందించే బృహత్ ప్రణాళికలను రూపొందించి పకడ్బందీగా అమలు చేస్తోంది. అందులో భాగంగానే జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో ఇప్పటికే చార్మినార్కు నాలుగు వైపులా ఉన్న చార్ కమాన్లను ఓల్డ్ సిటీకి ప్రత్యేక ఆకర్షణగా ఉన్న చుడీబజార్, ముర్గీక్, క్లాక్ టవర్, జుల్ఫీకన్ కమాన్, మోజంజాహీ మారెట్లను పునరుద్ధరించడం ద్వారా వాటికి పూర్వ వైభవాన్ని తీసుకువచ్చింది. ఇందులో భాగంగానే 27 చోట్ల వారసత్వ సంపద పరిరక్షణకు జీహెచ్ఎంసీ నడుం బిగించింది. ఈ మేరకు ప్రణాళిక విభాగం ఆధ్వర్యంలో వారసత్వ కట్టడాలకు అచ్చు గుద్దినట్లు ఆకృతులను తయారు చేసే అర్కిటెక్ట్ల ఎంపిక మొదలైంది.
అర్హత గల సంస్థలు ఈ నెలాఖరులోగా దరఖాస్తులు చేసుకోవాలని, అర్హతలను పరిశీలించాక 20 సంస్థలను ఎంపిక చేయాలని ప్రాథమికంగా నిర్ణయించారు. కట్టడాల పునరుద్ధరణ చర్యల్లో భాగంగా డిజైన్ల రూపకల్పన, పనుల నియామక ప్రక్రియలను సులభతరం చేస్తూ తాజాగా ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు అనుభవం ఉన్న సంస్థలను మూడేళ్ల పాటు ఎంప్యానెల్మెంట్ చేయాలని నిర్ణయించి, తద్వారా వీరితో వెను వెంటనే సంబంధిత కట్టడాల ఆకృతులను గీసే పని అప్పజెప్పడం, సమాంతరంగా నిర్మాణ పనులను చేపట్టి నిర్ణీత వ్యవధిలోనే పరిరక్షణ చర్యలు పూర్తి చేసి కట్టడాలకు పూర్వ వైభవం తీసుకురావచ్చని ఈ సందర్భంగా ప్రణాళిక విభాగం అధికారులు తెలిపారు.