హైదరాబాద్ : అంతర్జాతీయ స్థాయిలో నిర్మించి ప్రారంభానికి సిద్ధంగా ఉన్న ప్రముఖ బౌద్ధ క్షేత్రం బుద్ధవనం ప్రాజెక్టు పై రూపొందించిన షార్ట్ ఫిల్మ్ను హైదరాబాద్లోని MCRHRDలో రాష్ట్ర మంత్రులు కేటీఆర్, శ్రీనివాస్ గౌడ్, తలసాని శ్రీనివాస్ యాదవ్, సబిత ఇంద్రారెడ్డి ఆవిష్కరించారు.
తెలంగాణ పర్యటకాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో డాక్యుమెంటరీ డైరెక్టర్ దూలం సత్యనారాయణ ఈ షార్ట్ ఫిల్మ్ను తీశారు. నల్గొండ జిల్లాలోని నాగార్జున సాగర్లో సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ప్రతిష్టాత్మకంగా రూపొందించారు.