హైదరాబాద్ : అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. స్థానికుల కథనం మేరకు..హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కుంట్లూరు నుంచి గోరెల్లి వెళ్లే రోడ్డు పక్కన కుంట్లూరు శ్రీరామ్ నగర్ కి చెందిన కార్తిక్ మృత దేహం కుళ్లిన స్థితిలో లభ్యమైంది. గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. కార్తిక్ మృతి చెందిన ప్రదేశంలో అతడి బైక్ నుజ్జు నుజ్జు అయి కనిపించింది. కార్తిక్ మృతిపై కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.