సిటీబ్యూరో, సెప్టెంబర్ 14 (నమస్తే తెలంగాణ): ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్రంగా మారడంతో గురువారం సాయంత్రం నగరంలోని పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసింది.
రాత్రి 8 గంటల వరకు సికింద్రాబాద్లో అత్యధికంగా 4.7, బంజారాహిల్స్, ఖైరతాబాద్లో 4.1, బేగంబజార్, జుమ్మెరాత్బజార్లో 4.0, ఉప్పల్ మారుతీనగర్, బతుకమ్మకుంటలో 3.7, చార్మినార్, సర్దార్మహల్, నాంపల్లి, అల్కాపురికాలనీ, అల్లబండ, బండ్లగూడ, గన్ఫౌండ్రి, విఠల్వాడి ప్రాంతాల్లో 3.5, జూబ్లీహిల్స్, జియాగూడ ప్రాంతాల్లో 2.0, రామంతాపూర్, ఫిల్మ్నగర్, గోల్కొండ, రెయిన్బజార్ ప్రాంతాల్లో 2.8 సెం.మీల చొప్పున వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. రాగల 48 గంటల్లో సిటీలోని పలు ప్రాంతాల్లో వానలు కురిసే అవకాశాలున్నట్లు తెలిపారు.