బడంగ్పేట, నవంబర్9: ఆడ బిడ్డలను కన్న తల్లిదండ్రులకు కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు కొండంత అండనిస్తున్నాయి. ఆడ పిల్లల పెండ్లీలు చేయాలంటే గతంలో అష్ట కష్టాలు పడే వారు. చాలీ చాలనీ సంపాదనతో ఆడ బిడ్డల పెండ్లిల్లు చేయాలంటే తలపానం తోకకు వచ్చేది. పెండ్లి చేయాలంటే అప్పుల కోసం సావుకారి దగ్గర పడిగాపులు కాసే వారు. అప్పులు దొరకక ఇబ్బంది పడే వారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్య మంత్రి కేసీఆర్ ఆడ బిడ్డలను కన్న తల్లిదండ్రుల గోస చూసి చలించి పోయారు. ఎవరు అడుగ కుండానే కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకం ప్రవేశ పెట్టారు. దీంతో ఆడ బిడ్డలను కన్న తల్లిదండ్రులకు పెండ్లీలు చేయాలన్న చింత పోయింది.
కల్యాణ లక్ష్మి, షాదీముబారక్ పథకం ద్వారా ప్రభుత్వం రూ. 1లక్షా116 లు నగదు అందజేస్తున్నారు. ఆడ బిడ్డలను కన్న తల్లిదండ్రులకు మేన మామగా కేసీఆర్ను జనం కీర్తిస్తున్నారు. ఈ పథకాలు ప్రవేశ పెట్టిన తర్వాతనే బాల్య వివాహాలు పూర్తిగా తగ్గాయి. అమ్మాయిలలో అక్షరాస్యత శాతం పెరిగిందని అధికారుల లెక్కలు చెబుతున్నారు. ప్రభుత్వం 18 సంవత్సరాలు నిండిన వారికి కల్యాణ లక్ష్మి, షాదీముబారక్ పథకం వర్తిస్తుందని నిబంధనలు పెట్టడంతో తప్పని సరిగా అమ్మాయిలకు పెండ్లీలు సరైన టైముకు చేస్తున్నారు. దీంతో లబ్ధి దారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఆడ బిడ్డలను కన్న తల్లిదండ్రులకు ఈ పథకం భరోసా కల్పిస్తుంది. మహేశ్వరం నియోజక వర్గంలో 11,168 మందికి కల్యాణ లక్ష్మి పథకం ద్వారా లబ్ధి పొందారు. నియోజక వర్గ వ్యాప్తంగా ప్రభుత్వం రూ.108 కోట్లు అందజేసింది. 533 మంది ఆడ బిడ్డలకు షాదీముబారక్ పథకం ద్వారా రూ.51 కోట్లు అందజేశారు. కుల మతాలకు, పార్టీలకు అతీతంగా ప్రభుత్వం పథకాలు వర్తించే విధంగా చొరవ తీసుకున్నారు. నియోజక వర్గంలో కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకం కోసం దరఖాస్తులు చేసుకున్న ప్రతి ఒక్కరికీ లబ్ధి చేకూరింది. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మహేశ్వరం నియోజక వర్గంలో షాదీ ముబారక్, కల్యాణ లక్ష్మి పథకాల కోసం ధరఖాస్తులు చేసుకున్న వారు ఎవరు అనేది చూడ కుండా ప్రతి ఒక్కరికీ వచ్చే విధంగా చొరవ తీసుకున్నారు. మహిళల పక్షపాతిగా మంత్రి పనిచేశారు. ఎవరైనా కల్యా ణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు అర్ణులైన ప్రతి ఒక్కరికీ ఇవ్వాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీచేశారు.