హయత్నగర్, మార్చి 14 : రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందిన సంఘటన హయత్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలో మంగళవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శ్యామల సమ్మక్క(50), భర్త సోమయ్యతో కలిసి టీవీఎస్ ఎక్స్ఎల్ మోపెడ్పై నాగోల్, జైపురికాలనీ నుంచి హయత్నగర్, వీరన్నగుట్ట కాలనీకి బయలుదేరారు. మార్గమధ్యలో పాపాయిగూడ చౌరస్తాకు చేరుకోగానే వెనుక నుంచి అతివేగం, అజాగ్రత్తగా దూసుకొచ్చిన డీసీఎం నం.(టీఎస్12యూడీ1533) ముందుగా వెళ్తున్న టీవీఎస్ను ఢీకొట్టింది.
ఈ ఘటనలో టీవీఎస్ మోపెన్పైన ఉన్న సమ్మక్క ఎగిరిపడటంతో డీసీఎం వెనుక టైరు ఆమె తలపై నుంచి వెళ్లింది. దీంతో తీవ్రంగా గాయపడ్డ ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.