బండ్లగూడ, జూన్ 30: అభివృద్ధిలో భాగంగా రోడ్ల విస్తరణకు తెలంగాణ ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుంది. రోడ్లు విశాలంగా ఉన్న ప్రాంతాల్లో మరింత అభివృద్ధి జరిగేందుకు అవకాశం ఉంటుంద ని భావించి రోడ్ల విస్తరణకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవడంపై స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని సన్సిటీలో పీఅండ్టీ కాలనీ వెళ్లే రహదారిలో రోడ్డు విస్తరణకు ఇటీవల ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. వెంటనే అధికారులు రోడ్ల విస్తరణ పనులను చేపట్టేందుకు గాను అధికారులు చర్యలు చేపట్టారు. ఇందు కోసం రోడ్లను ఎంతమేరకు విస్తరించాలనేది సిబ్బంది మార్కింగ్ చేస్తున్నారు. ఈ రోడ్డు విస్తరణ పనులు జరిగితే పీఅండ్టీ కాలనీ, రిచ్మండ్ విల్లా, మైఖేల్టౌన్, తదితర ప్రాంతాలలోని ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బందులు తీరనున్నాయి. రోడ్ల విస్తరణ చేపడుతుండటంతో స్థానిక ప్రజలు, వాహనదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.