కీసర, జూన్4: రాష్ట్ర ప్రభుత్వం సర్కారు స్కూళ్లను బలోపేతం చేసేందుకు కృషి చేస్తుంది. నాణ్యమైన విద్యను అందించేందుకు ఎప్పటికప్పుడు తగిన చర్యలు చేపడుతుంది. సర్కా ర్ స్కూళ్లలో మౌలిక వసతులు కల్పిస్తూ కార్పొరేట్కు ధీటుగా సర్కారు బడులను తీర్చిదిద్ది నాణ్యమైన బోధనను అందస్తుంది. 2023-24 విద్యాసంవత్సరం ప్రారంభానికి ముందే ప్రభుత్వం అన్ని ప్రభుత్వ పాఠశాలలకు పాఠ్యపుస్తకాలను అందించేందుకు తగు చర్యలు తీసుకుంటుంది. కీసర మండలంలో మొత్తం 37 ప్రభుత్వ పాఠశాలలకు గాను ఈ సంవత్సరం 34,761 పాఠ్యపుస్తకాలు అవసరం ఉన్నాయి.
మొద టి విడుతగా 12,261 పాఠ్యపుస్తకాలను మండల విద్యా వనరుల కేంద్రానికి పంపించడంతో ఆ పాఠ్యపుస్తకాలు ఆయ పాఠశాలలకు పంపిణీ చేయడానికి సిద్ధ్దంగా ఉన్నాయి. ఇంకా 22,500 పాఠ్య పుస్తకాలు రావాల్సి ఉందని, ఇంకా రెండో, మూడో విడుతల్లో పూర్తిగా పాఠ్యపుస్తకాలను ప్రభుత్వ పాఠశాలలకు పంపిణీ చేయడం జరుగుతుందని మండల విద్యాధికారి శశిధర్ తెలిపారు.ప్రభుత్వ పాఠశాల్లో ఇంగ్లిష్ మీడి యం ప్రవేశపెట్టడంతో విద్యార్థులు సర్కారు బడుల్లో చేర్పిం చేందుకు దృష్టిని పెడుతున్నారు. ఈ సంవత్సరం ప్రభుత్వం ఇంగ్లిష్, తెలుగు మీడియం విద్యార్థులకు ఇబ్బందులు రాకుం డా ఒకే పుస్తకంలో పాఠ్యంశాలను ముద్రించింది. ఇంగ్లిష్ మీడియంలో ఎదురయ్యే ఇబ్బందులను దూరం చేయడానికి చర్యలు తీసుకుంటుంది. రెండు భాషాల్లో పాఠ్యపుస్తకాలను ముద్రించడంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
సర్కారు బడులకు మొదటి విడుత కింద వచ్చిన పాఠ్యపుస్తకాలను పంపి ణీ చేస్తాం. ఈనెల 12వ తేదీ నుంచి బడులు పునః ప్రారంభం అవుతాయి. 12వ తేదీన బడి బాట కార్యక్రమాన్ని నిర్వహించి విద్యార్థులు, తల్లిదండ్రుల్లో ఉత్సాహాన్ని నింపి పిల్లలను ప్రభుత్వ పాఠశాల్లోనే చేర్పించాలని కోరుతాం. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఈనెల 20వ తేదీన కూడా విద్యా దినోత్సవాన్ని నిర్వహిస్తాం. పాఠ్యపుస్తకాలను త్వలరో పంపిణీ చేస్తాం.
-ఎంఈవో శశిధర్