అబిడ్స్ /సుల్తాన్బజార్, జనవరి 7 : క్రీడలకు అధిక ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు మెడల్స్ సాధించిన క్రీడాకారులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రో త్సాహకాలను అందిస్తుందని పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. శనివారం నిజాం కళాశాల మైదానంలో మేరు సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన మేరు క్రికెట్ లీగ్ పోటీలను ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన క్రికెట్ ఆడి క్రీడాకారులలో ఉత్సాహాన్ని నింపారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. సామాజిక వర్గాల వారిని ఒకే తాటిపైకి తీసుకువచ్చేందుకు గాను ఇటువంటి క్రీడలు దోహదం చేస్తాయన్నారు.
ప్రస్తుతం ట్వంటీ 20 క్రికెట్ పోటీలకు క్రేజ్ ఉందని.. క్రీడాకారులు ప్రతిభను చాటి జాతీయ,అంతర్జాతీయ స్థాయిలో బంగారు పతకాలను సాధించి తెలంగాణ కీర్తి ప్రతిష్టలను ప్రపంచానికి చాటి చెప్పాలన్నారు. రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ వకుళాభరణం కృష్ణమోహన్రావు మాట్లాడుతూ.. మేరు కులస్తులుక్రికెట్ లీగ్ పేరిట యువతలో ఉన్న మక్కువకు అనుగుణంగా పోటీలను నిర్వహించడం నూతన ఒరవడికి శ్రీకారమని అన్నారు. లీగ్లో 12 నియోజక వర్గాలకు చెందిన 12 జట్లు పాల్గొన్నాయని నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో క్రికెట్ లీగ్ నిర్వాహకులు గిరిధర్, లక్ష్మీ నారాయణ, జి.అరుణ్కుమార్, కాపర్తి రవి కుమార్, సూరజ్, ఓడల శేఖర్, కీర్తి వినయ్, శ్రవణప్ప పాల్గొన్నారు.
పోటీలను ఎమ్మెల్యే నోముల భగత్ బౌలింగ్ చేయగా మంత్రి బ్యాటింగ్ చేసి ప్రారంభించారు. కార్యక్రమంలో నగర గ్రంథాలయ మాజీ చైర్మన్ గడ్డం శ్రీనివాస్ యాదవ్, సంఘం అధ్యక్షుడు భాస్కర్రావు, అరుణ్, వెంకటేశ్వరరావు, సూరజ్, నర్సింగ్రావు, సతీశ్, సత్యనారాయణ, గజాలి శ్రీకాంత్ పాల్గొన్నారు.