సిటీబ్యూరో, మార్చి 2 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్, సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ల పరిధిలో మరోసారి భారీగా ఇన్స్పెక్టర్లకు స్థానచలనం కల్పిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో బదిలీలు చేపడుతున్నట్లు పేర్కొంది. ఈ క్రమంలో హైదరాబాద్ పరిధిలో 63 మంది, సైబరాబాద్ పరిధిలో 41 మంది ఇన్స్పెక్టర్లను బదిలీ చేస్తూ పోలీసు శాఖ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. బదిలీ అయిన వారు తక్షణమే కొత్త పోస్టింగ్లలో చేరాల్సిందిగా ఆదేశించింది.