హైదరాబాద్ : అభివృద్ధిలో సనత్ నగర్ నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దడమే తన లక్ష్యం అని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పారు. సోమవారం సనత్ నగర్ నియోజకవర్గ పరిధిలోని బన్సీలాల్ పేట, రాంగోపాల్ పేట డివిజన్ లలో 1.75 కోట్ల రూపాయల అభివృద్ధి పనులను మంత్రి తలసాని ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గతంలో ఈ ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహించిన వారు ఎవరు చేయలేని విధంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సనత్ నగర్ నియోజకవర్గ పరిధిలో కోట్లాది రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టి ప్రజల సమస్యలు అనేకం పరిష్కరించినట్లు తెలిపారు.
ముందుగా బన్సీలాల్ పేట డివిజన్ పద్మారావు నగర్ లోని ఈశ్వరమ్మ బస్తీలో 24.13 లక్షల రూపాయల వ్యయంతో చేపట్టనున్న CC, VDCC రోడ్ల నిర్మాణ పనులను ప్రారంభించారు. అనంతరం పద్మారావు నగర్ పార్క్ లో నూతనంగా నిర్మించిన గాజీబో ను, పద్మారావు నగర్, NTR విగ్రహం వద్ద 13.90 లక్షల వ్యయంతో ఏర్పాటు చేయనున్న సీవరేజ్ పైప్ లైన్ పనులను, వెంకటాపురం పార్క్ వద్ద 22.50 లక్షల రూపాయల వ్యయంతో చేపట్టనున్న VDCC రోడ్డు పనులను, ముస్లీం వక్ఫ్ బోర్డ్ (near rail kalarang) లో 11.50 లక్షల రూపాయల వ్యయంతో చేపట్టనున్న CC రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభించారు.
ఈ సందర్భంగా వెంకటాపురం పార్క్ లో వాకింగ్ ట్రాక్, ఓపెన్ జిమ్ ఏర్పాటు చేయాలని స్థానిక ప్రజలు మంత్రిని కోరారు. అవసరమైన చర్యలు తీసుకోవాలని జోనల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి ని ఆదేశించారు. ముస్లిం వక్ఫ్ బోర్డ్ లో నివసిస్తున్న వారిలో గతంలో కొంత మందికి రెగ్యులరైజ్ చేశారని, తమకు కూడా రెగ్యులరైజ్ చేయాలని కోరగా, పరిశీలించాలని సికింద్రాబాద్ తహసీల్దార్ బాలశంకర్ ను మంత్రి ఆదేశించారు.
రాంగోపాల్ పేట డివిజన్..
MG రోడ్ లోని ఆజామ్ హోటల్ వద్ద 14 లక్షల రూపాయల వ్యయంతో చేపట్టనున్న సీవరేజ్ పైప్ లైన్ పునరుద్ధరణ పనులను మంత్రి ప్రారంభించారు. అదేవిధంగా మేక్లే గూడ ప్లే గ్రౌండ్ వద్ద 18.50 లక్షల రూపాయల వ్యయంతో చేపట్టనున్న storm water drain remodeling పనులను, జవహర్ నగర్ లోని లక్ష్మీనారాయణ అపార్ట్ మెంట్ వద్ద 42 లక్షల రూపాయల వ్యయంతో చేపట్టనున్న CC రోడ్డు నిర్మాణ పనులు, storm water drain మరమ్మతు పనులను ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆజామ్ హోటల్ పక్కన సందులో టాయిలెట్స్ నిర్మించాలని స్థానికులు కోరగా, నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
కార్యక్రమంలో జోనల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, కార్పొరేటర్ లు హేమలత, సుచిత్ర, మాజీ కార్పొరేటర్ అత్తిలి అరుణ గౌడ్, EE సుదర్శన్, వాటర్ వర్క్స్ GM రమణా రెడ్డి, ఎలెక్ట్రికల్ DE శ్రీధర్, టౌన్ ప్లానింగ్ ACP క్రిస్టోఫర్, హార్టికల్చర్ DD శ్రీదేవి, హెల్త్ ఆఫీసర్ ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.