ముషీరాబాద్జోన్ బృందం, జనవరి 18: ముషీరాబాద్ ఎమ్మెల్యేగా మూడేండ్లలో నియోజకవర్గంలో రూ. 150 కోట్లతో పలు అభివృద్ధి పనులు పూర్తి చేశామని స్థానిక ఎమ్మెల్యే ముఠా గోపాల్ తెలిపారు. ఎమ్మెల్యేగా మూడేండ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా మంగళవారం నియోజకవర్గ వ్యాప్తంగా కార్యకర్తలు ఎమ్మెల్యేను సన్మానించారు. భోలక్పూర్ డివిజన్లోని అంజుమన్ వీధి, సం జీవయ్యనగర్లో ఎమ్మెల్యే పాదయాత్రను నిర్వహించి ప్రజా సమస్యలను బస్తీవాసులను అడిగి తెలుసుకున్నా రు. అదే విధంగా రాంనగర్ పార్టీ కార్యాలయంలో డివిజన్ అధ్యక్షుడు మోజస్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యేను సన్మానించారు. గాంధీనగర్ పార్టీ అధ్యక్షుడు ఎం. రాకేశ్ ఆధ్వర్యంలో ఆంధ్రాకేఫ్ వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు,కార్యకర్తలతో కలిసి కేక్కట్ చేశా రు. అనంతరం ఎమ్మెల్యే ముఠా గోపాల్ను షాలువాలు, పూల మాలలతో ఘనంగా సత్కరించారు.
అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే ముఠా గోపాల్ మాట్లాడుతూ నియోజక వర్గంలో తాగునీటి, డ్రైనేజీ సమస్యల పరిష్కారం, వీడీసీ, సీసీ రోడ్ల నిర్మాణం, విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు, బాగ్లింగంపల్లి, సాయిచరణ్ కాలనీ, టి. అంజయ్యనగర్లలో పేదలకు డబుల్ బెడ్రూం ఇండ్లు ఏర్పాటు చేశామని ఆయన తెలిపారు. అదే విధంగా కవాడిగూడ డివిజన్ పరిధిలోని హుస్సేన్ సాగర్ నాలా విస్తరణలో నాలా పక్కన ఉన్న పేదల ఇండ్లు కోల్పోకుండా సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ల దృష్టికి తీసుకెళ్లి సమస్యను పరిష్కరించామన్నారు.
అడిక్మెట్ డివిజన్లో నాగమయ్యకుంటలో రూ. 50 కోట్లతో కొత్తబ్రిడ్జీల నిర్మాణానికి చర్యలు, హెరిటేజ్ మార్కెట్ వద్ద రెండు మీటర్ల వరకు తూంల ఏర్పాటు, రంనగర్లో డివిజన్లోని ఫిష్ మార్కెట్ అభివృద్ది, పేదలకు మెరుగైన వైద్యం అందించేందుకు 12 బస్తీ దవాఖానల ఏర్పాటు, కార్పొరేట్ విద్యా సంస్థలకు ధీటుగా పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పించామని అన్నారు. భోలక్పూర్లో రూ. 24 కోట్లతో తాటునీటి, డ్రైనేజీ పైప్లైన్ నిర్మాణం, సీసీ రోడ్లు, వీడీసీ రోడ్ల ఏర్పాటు చేశామన్నారు. దేశంలో ఎక్కడలేని విధంగా ఆడబిడ్డలకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్, పింఛన్లు ఇతర అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి పేదల పక్షపాతిగా సీఎం కేసీఆర్ నిలిచారని అన్నారు. నగరంలోనే ముషీరాబాద్ నియోజక వర్గాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. పెండింగ్ పనులను పూర్తి చేసిన ఘనత తమేదనన్నారు.
కార్యక్రమంలో జలమండలి డీజీఎం చంద్రశేఖర్, టీఆర్ఎస్ నగర యువజన విభాగం సీనియర్ నాయకుడు ముఠా జయసింహ, టీఆర్ఎస్ రాష్ట్ర మాజీ కార్యదర్శి షరీపోద్దీన్, భోలక్పూర్ టీఆర్ఎస్ ఇన్చార్జి బింగి నవీన్కుమార్, డివిజన్ అధ్యక్షుడు వై. శ్రీనివాస్ రావు, మాజీ అధ్యక్షుడు మహ్మద్ అలీ, ఉపాధ్యక్షులు ఎ. శంకర్ గౌడ్, బడుగు ప్రవీణ్కుమార్, ఆర్. శ్రీనివాస్, మున్వర్ చాంద్, సీనియర్ నాయకులు శ్రావణ్కుమార్, ఎం. రవీందర్, సీహెచ్. ఉప్పలయ్య, మక్బూల్, రహీం, జబ్బార్, ప్రవీణ్, మాజీ కార్పొరేటర్ ముఠా పద్మానరేశ్, పార్టీ సీనియర్ నాయకుడు ముఠా నరేశ్,పార్టీ యువజన విభాగం నాయకుడు ముఠా జయసింహ,ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్, పరుశురామ్, మారిశెట్టి నర్సింగ్ రావు, ఎర్రం శ్రీనివాస్ గుప్తా, ఆకుల శ్రీనివాస్,పాశం రవి,టీ ఆర్ఎస్ యూత్ విభాగం నేత ముఠా జయసింహ, రాంనగర్ డివిజన్ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షు డు రావులపాటి మోజస్, ఎర్రం శేఖర్, మురళి, మధు, నీలాదేవి, హుస్సే న్, కల్యాణ్ నాయక్, రాజుచారి, సత్యనారాయణ, టీవీరాజు, జనార్ద న్, ప్రవీణ్, సందీప్, శ్రీకాంత్, తులసి, మంజుల, మరి యా, లక్ష్మీబాయి, నాగలక్ష్మి, శోభ, మహే శ్వరి, వెంకటేశ్, రమేశ్ తదితరులు పాల్గొన్నారు.