దేశ రాజధానిలో తెలంగాణ ఆత్మగౌరవ పతాక సగర్వంగా ఎగిరింది. గులాబీ జెండా రెపరెపలాడింది. పట్టుదల, దూరదృష్టి, నిబద్ధత కలిగిన బీఆర్ఎస్.. తెలంగాణ మాడల్తో దేశ గతిని మార్చే దిశగా అడుగులు వేసింది. జాతీయ రాజకీయ విస్తరణకు శాశ్వత వేదికగా ఢిల్లీలోని వసంత్విహార్లో నిర్మించిన బీఆర్ఎస్ భవన్ను సీఎం కేసీఆర్ గురువారం ప్రారంభించారు. కార్యక్రమంలో పార్టీ ప్రజాప్రతినిధులు, శ్రేణులు పాల్గొన్నారు.
బీఆర్ఎస్ భవన్ను ప్రారంభిస్తున్న సీఎం కేసీఆర్, చిత్రంలో మంత్రులు వేముల ప్రశాంత్రెడ్డి, శ్రీనివాస్గౌడ్, మల్లారెడ్డి, ఎంపీలు కేశవరావు, నామా నాగేశ్వరరావు, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్
భవనంలో అడుగుపెడుతున్న సీఎం కేసీఆర్
అమ్మవారి పూజలో పాల్గొన్న సీఎం కేసీఆర్, మంత్రులు శ్రీనివాస్గౌడ్, మల్లారెడ్డి, వేముల ప్రశాంత్రెడ్డి, పువ్వాడ అజయ్, ఎంపీలు కేశవరావు, నామా నాగేశ్వరరావు, ఎమ్మెల్యే కాలె యాదయ్య, ఎమ్మెల్సీలు శంభీపూర్ రాజు, కౌశిక్రెడ్డి తదితరులు
హోమంలో పాల్గొన్న మంత్రులు కేటీఆర్, శ్రీనివాస్గౌడ్, ఎంపీ సంతోష్కుమార్