సిటీబ్యూరో, మార్చి 8 (నమస్తే తెలంగాణ):తాజ్ కృష్ణ హోటల్లో బుధవారం ‘వీ హబ్’ ఐదో వార్షికోత్సవం ఘనంగా జరిగింది. ముఖ్యఅతిథిగా హాజరైన మంత్రి కేటీఆర్ స్ఫూర్తిదాయకంగా ప్రసంగించారు. ఇంటరాక్టివ్ సెషన్లో పలు ఆసక్తికర అంశాలు వెల్లడించారు. పలువురు మహిళా పారిశ్రామిక వేత్తలను సత్కరించారు.
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా హనుమకొండలోని కాకతీయ యూనివర్సిటీ ఆడిటోరియంలో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి మహిళా దినోత్సవాన్ని బుధవారం ఘనంగా నిర్వహించారు. ఆయా జిల్లాల నుంచి వివిధ విభాగాల్లో ఎంపికైన 27మంది ప్రతిభావంతులకు రాష్ట్ర గిరిజన, స్త్రీ శిశుసంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్, మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ కమిషనర్ భారతి హోలి కేరి, చీఫ్విప్ దాస్యం వినయ్భాస్కర్, వరంగల్ మేయర్ సుధారాణి, హనుమకొండ కలెక్టర్ సిక్తా పట్నాయక్, కేయూ వీసీ రమేశ్ తదితరులు అవార్డులు అందజేశారు. రూ.లక్ష చొప్పున చెక్కులు, ప్రశంసాపత్రాలు ప్రదానం చేసి వారిని సన్మానించారు.