మల్కాజిగిరి, డిసెంబర్ 2: మల్కాజిగిరి నియోజకవర్గం 2009లో ఏర్పడగా.. 2009లో కాంగ్రెస్, 2014, 2018 ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయం సాధించింది. ప్రస్తుతం జరిగిన ఎన్నికల్లో ఓటర్లు బీఆర్ఎస్ పార్టీ చేసిన అభివృద్ధి, సంక్షేమం రెండింటిని పరిగణలోకి తీసుకుని ఓ ట్లు వేసినట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కాంగ్రెస్ అధికా రంలో ఉన్నప్పుడు కరెంటు కష్టాలు ప్రజలు ఇప్పటికి మరచిపోలేదు. ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ ప్రత్యేక ప్రణాళికలు అమలుపర్చడంతో ఓటర్లు అందరూ బీఆర్ఎస్పార్టీకే వేసినట్లు ఎన్నికల సరళినిబట్టి తెలుస్తున్నది.
మల్కాగిరి నియోజకవర్గం బీఆర్ఎస్ అభ్యర్థి మర్రి రాజశేఖర్ రెడ్డి ప్రచారం ప్యూహంతో మంచి ఫలితాలు రానున్నాయి. గత నలభై రోజులుగా ఇంటింటికి ప్రచారంతోపాటు సమావేశాల్లో పాల్గొన్నారు. ఉదయాన్నే పార్కుల్లోని వాకర్స్తో కలసి మాటముచ్చటతో ఓటర్లకు మ రింత దగ్గరైనారు. వారు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానాలు చెప్పా రు. కార్పొరేటర్లు సునీతారాము యాదవ్, మీనా ఉపేందర్ రెడ్డి, శాంతిశ్రీనివాస్ రెడ్డి, సబితాకిశోర్, మురుగేశ్, మాజీ కార్పొరేటర్లు జగదీష్గౌడ్, ఆకుల నర్సింగరావు, మల్కాజిగిరి, అల్వాల్ మున్సిపల్ మాజీ చైర్మన్లు సూర్యనారాయణ రెడ్డి, జీవకన్, మాజీ ఫ్లోర్ లీడర్లు శ్రీనివాస్ రెడ్డి, డోలి రమేశ్, హుడా మాజీ డైరెక్టర్ వీరేశం యాదవ్, జేఏసీ వెంకన్న, మాజీ కౌన్సిలర్లతో కలసి ముమ్మరంగా ప్రచారం నిర్వహించారు. అభ్యర్థి తండ్రి మర్రి లక్ష్మణ్రెడ్డి, భార్య మర్రి మమతారెడ్డిలు ప్రచారంలో పాల్గొని నాయకులు, కార్యకర్తలకు మరింత ఉత్సహాన్ని కలుగజేశారు. సీఎం కేసీఆర్ ప్రకటించిన మ్యానిఫెస్టోలోని అన్ని అంశాలను ప్రజల వద్దకు తీసుకువెళ్లడంలో సఫలీకృతులైనారు. దీంతో ఓటర్లు అభివృద్ధికి పట్టాం కట్టారని, ఓట్ల లెక్కింపులో తేటతెల్లం కానుందని విశ్లేషకులు అంటున్నారు.