కాచిగూడ ( హైదరాబాద్ ) : హైదరాబాద్ను విశ్వనగరంగా తీర్చిదిద్దడానికి సీఎం కేసీఆర్( CM KCR ) బృహత్తర ప్రణాళికతో స్వచ్ఛ సర్వేక్షణ్ను చేపట్టారని అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ (Mla Kaleru Venkatesh ) తెలిపారు. శుక్రవారం కాచిగూడలోని వైఎంసీఏ, లింగంపల్లిచౌరస్తా, కుద్భిగూడ, చెప్పల్బజార్, నింబోలిఅడ్డా, గోల్నాక డివిజన్లోని కొత్త బ్రిడ్జి, జిందాతిలస్మాత్ రోడ్, డీ మార్ట్లైన్, వడ్డెరబస్తీలల్లో జీహెచ్ఎంసీ కమిషనర్ ( GHMC Commissioner) రోనాల్డ్రోస్, అధికారులతో కలిసి పర్యటించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ స్వచ్ఛ సర్వేక్షణ్తో రూపు రేఖలు పూర్తిగా మారనున్నాయని, ముఖ్యంగా అంతర్జాతీయ స్థాయిలో హైదరాబాద్ కీర్తి మరింతగా పెరగనుందని పేర్కొన్నారు. ప్రజలు ఇంటి నుంచే తడి చెత్త, పొడి చెత్తలను వేరు చేసి చెత్తరిక్షాలలో వేసి పరిశుభ్రతను పాటించి, స్వచ్ఛ సర్వేక్షణ్ను విజయవంతం చేయాలని కోరారు.
స్వచ్ఛత విషయంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని, భావితరాలకు దారి చూపలనే ఉద్దేశంతో స్వచ్ఛ సర్వేక్షణ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో జోనల్ కమిషనర్ రవికిరణ్, డీఎంసీ వేణుగోపాల్, ఏఎంహెచ్ఓ జ్యోతిబాయి, ఈఈ పేరిరాజు, జీహెచ్ఎంసీ సిబ్బంది,బీఆర్ఎస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.