సిటీబ్యూరో, జనవరి 5 (నమస్తే తెలంగాణ) : జీహెచ్ఎంసీ పరిధిలో ఓటర్ల తుది జాబితాను ఎన్నికల సంఘం గురువారం విడుదల చేసింది. గ్రేటర్లోని 24 నియోజకవర్గాల పరిధిలో మొత్తం 83,40,854 లక్షల మంది ఓటర్లు ఉండగా, ఇందులో పురుషులు 43, 26, 411 లక్షల మంది ఉన్నారు. మహిళలు 40,19, 568 ఉండగా, ఇతరులు 875 మంది ఉన్నారు. అత్యధికంగా శేరిలింగంపల్లిలో 6,44, 072, రెండో స్థానంలో 6,12,700 మంది ఓటర్లతో కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నిలిచింది.