వనస్థలిపురం, ఆగస్టు 18 : దళిత బంధు పథకంతో పేద కుటుంబాల్లో వెలుగులు రానున్నాయని టీఆర్ఎస్ వనస్థలిపురం డివిజన్ అధ్యక్షుడు చింతల రవికుమార్ అన్నారు. బుధవారం వనస్థలిపురం సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దళితుల అభివృద్ధి పట్ల చిత్తశుద్ధి ఉన్న నాయకుడు కేసీఆర్ అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రతి కుటుంబానికి రూ.10లక్షలు అందజేస్తున్న ఘనత తెలంగాణ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు.
పైలెట్ ప్రాజెక్టు ముగిసిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా పథకాన్ని అమలు చేస్తారన్నారు. ఈ పథకంతో ప్రతిపక్షాలు దిక్కుతోచని స్థితిలో పడిపోయాయన్నారు. కార్యక్రమంలో ఎస్సీ రైట్స్ ప్రొటెక్షన్ కమిటీ జిల్లా అధ్యక్షుడు గంగం శివశంకర్, సంజయ్కుమార్, లగ్గోని శ్రీధర్గౌడ్, మిట్టా రామ్మోహన్, రవి, గౌతమ్, రాజు, దినేష్, ఏసురత్నం తదితరులు పాల్గొన్నారు.