సిటీబ్యూరో, జనవరి 4(నమస్తే తెలంగాణ): ప్రస్తుత వాతావరణ పరిస్థితులు నగరం వంట్లో వణుకు పుట్టిస్తున్నాయి. కాశ్మీర్, షిమ్లా లాంటి వాతావరణ స్థితిగతులు నగరంలో తాండవం చేస్తుండటంతో చలి తీవ్రత పెరిగింది. ఈశాన్య గాలుల ప్రభావంతో గ్రేటర్ వణుకుతోంది. రాత్రి ఉష్ణోగ్రతలు 10 కంటే తక్కువకు నమోదవడం, అదే సమయంలో పగటి ఉష్ణోగ్రతలు పెరగడంతో ఒక పక్క చలి తీవ్రత, మరో పక్క ఎండ తీవ్రతతో నగరంలో భిన్న వాతావరణం నెలకొంది.
ఈ క్రమంలోనే శనివారం ఉదయం నుంచి రాత్రి వరకు నగరంలో కనిష్ట ఉష్ణోగ్రతలు రాజేంద్రనగర్ ప్రాంతంలో అత్యల్పంగా 9.0 డిగ్రీలు, సరాసరి నగరంలో 13.2 డిగ్రీలు, గరిష్ట ఉష్ణోగ్రతలు 30.4 డిగ్రీలు, గాలిలో తేమ 40 శాతంగా నమోదైనట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు.