శంషాబాద్ రూరల్: గుడిసెలో నిద్రపోతున్న బాలుడిపై వీధి కుక్కలు దాడి చేయడంతో మృతి చెందాడు. శంషాబాద్ ఆర్జీఐఏ సీఐ బాలరాజు తెలిపిన వివరాల ప్రకారం.. శంషాబాద్ పట్టణంలోని రాజీవ్గృహకల్ప సామ ఎన్క్లే సమీపంలో గుడిసెలో కుటుంబసభ్యులతో కలిసి నిద్రించిన నాగరాజు(1)పై బుధవారం అర్ధరాత్రి వీధి కుక్కలు దాడి చేయడంతో చనిపోయాడు.