కుత్బుల్లాపూర్, జనవరి 29 : ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పని చేస్తున్నామని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అన్నారు. ఆదివారం నియోజకవర్గానికి చెందిన పలు సంఘాలు, కాలనీ సంక్షేమ సం ఘాల ప్రతినిధులు, పార్టీ శ్రేణులు ఆయనను కలిసి.. త మ కాలనీల్లో సమస్యలపై వినతిపత్రాలను అందజేశారు. అలాగే.. పలు ప్రాంతాల్లో పర్యటించి.. సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. మరికొన్ని ప్రాంతాల్లో అభివృద్ధి పనులు ప్రారంభించారు.
డివిజన్, మహేంద్రనగర్లో రూ.20 లక్షల వ్యయంతో అంతర్గత సీసీరోడ్డు నిర్మాణ పనులు పూర్తి చేసిన సందర్భంగా కాలనీ సంక్షేమ సంఘం ప్రతినిధులు ఎమ్మెల్యేను కలిసి కృతజ్ఞతలు తెలిపారు.
డివిజన్, పేట్ బషీరాబాద్ సయ్యద్నగర్లో ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ పాదయాత్ర చేపట్టారు. ఈ సం దర్భంగా స్థానికంగా నెలకొన్న కాలనీ సమస్యలపై కాలనీవాసులను అడిగి తెలుసుకున్నారు. సంబంధిత అధికారులతో చర్చించి, సమస్యలను పరిష్కరించేందుకు సత్వర చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు ఇందిరారెడ్డి, నాయకులు సుధాకర్గౌడ్, సీనియర్ నాయకులు కుంట సిద్ధిరాములు, నాగేశ్, గణేశ్, తదితరులు పాల్గొన్నారు.
డివిజన్, సన్మాన్ బెల్మోర్ విల్లాస్లో రూ.28 లక్షల వ్యయంతో నిర్మించిన సీసీరోడ్డు పనులను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కాలనీవాసులు , నాయకులు పాల్గొన్నారు.
లూయిస్ బ్రెయిలీ 214 జయంతి వేడుకల్లో ఎమ్మెల్యే కేపీ వివేకానంద్, గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ దర్గా దయాకర్రెడ్డి హాజరై క్యాలెండర్ను ఆవిష్కరించి.. కేక్ కట్ చేసి వేడుకలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ద బ్లైండ్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు వీసీ వీర రాఘవన్, వెల్ఫేర్ అసోసియేషన్ డిసెబుల్డ్ అధ్యక్షుడు జి.అంజయ్య, సారా ప్రవీణ్కుమార్, స్థానిక నేతలు పోలే శ్రీకాంత్, మన్నె రాజు, రవీందర్ముదిరాజ్, వెంకటస్వామి, పందిరి యాదగిరి, తదితరులు పాల్గొన్నారు.