కవాడిగూడ, మార్చి 1: కుమ్మెర మల్లన్న జాతరలో రజక కుటుంబంపై దాడిచేయడంతో పాటు రెండు నెలల చిన్నారి చావుకు కారణమైన హంతకులను కఠినంగా శిక్షించాలని తెలంగాణ రజక అభివృద్ధి సంస్థ వర్కింగ్ చైర్మన్ మందలపు గాంధీ, గ్రేటర్ హైదరాబాద్ చైర్మన్ ఎం.నర్సింహులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈమేరకు తెలంగాణ రజాకాభివృద్ధి సంస్థ గ్రేటర్ హైదరాబాద్ ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి లోయర్ ట్యాంక్బండ్లోని చాకలి ఐలమ్మ విగ్రహం వద్ద కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సీఎం రేవంత్రెడ్డి తక్షణమే స్పందించి చిన్నారి కుటుంబానికి కోటిరూపాయల ఎక్స్గ్రేషియా, బాధిత కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇచ్చి వారికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. నిందితులపై చ్యలు తీసుకునేంతవరకు పోరాటం కొనసాగిస్తామని తెలిపారు.నిందితులను శిక్షించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సంస్థ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జూపల్లి రాజశేఖర్, నాయకులు కె.హరినాథ్, నర్సింగ్రావు, చి.చుక్కయ్య, బి.చంద్రమోహన్, పి.శ్రీధర్, రాజు, సుధాకర్, ఆందోళ్మ్రేష్, శ్రీనివాస్, సాయిసత్యనారాయణ, సుదర్శన్, బిక్షపతి, మురళి, జ్ఞానేశ్వర్, సందీప్ తదితరులు పాల్గొన్నారు.