సిటీబ్యూరో: సైబర్క్రైమ్ కేసులో అరెస్టు చేయకుండా ఉండాలంటే లక్ష రూపాయల లంచం డిమాండ్ చేసిన ఇద్దరు మల్కాజిగిరి సైబర్క్రైమ్ ఠాణాకు చెందిన ఎస్సైలను ఏసీబీ రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నది. ఏసీబీ అధికారుల కథనం ప్రకారం… ఆర్మూడ్ రిజర్వు సబ్ ఇన్స్పెక్టర్లు ప్రమోద్ గౌడ్, జటావత్ బాబు నాయక్ మల్కాజిగిరి సైబర్ఠాణాలో పనిచేస్తున్నారు. బాధితుడిని అరెస్టు చేయకుండా బీఎన్ఎస్ 35(41ఏ సీఆర్పీసీ) నోటీసులు ఇవ్వాలంటే తమకు లక్ష రూపాయలు కావాలంటూ డిమాండ్ చేశారు.
బాధితుడు ఈ విషయంపై ఏసీబీకి ఫిర్యాదు చేయడంతో సిటీ రేంజ్ -2 యూనిట్ అధికారులు రంగంలోకి దిగారు. ప్రమోద్గౌడ్ తరపున, జటావత్ బాబునాయక్ బాధితుడి వద్ద నుంచి లక్ష రూపాయల లంచం తీసుకుంటుండగా, ఎల్బీనగర్ చౌరస్తాలో పట్టుబడ్డాడు. లక్ష రూపాయల నగదును స్వాధీనం చేసుకొని, ఇద్దరు ఎస్సైలను అరెస్టు చేశారు.