సిటీబ్యూరో, మార్చి 5 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ సైక్లిస్ట్స్ గ్రూప్ 6వ వార్షికోత్సవం ఘనంగా జరిగింది. 200 మంది సైక్లిస్టులు చార్మినార్ వద్ద సందడి చేశారు. సైక్లింగ్పై అవగాహన కల్పించడంలో భాగంగా ఏర్పాటైన హెచ్సీజీ 6 ఏండ్లల్లో సైక్లింగ్పై అనేక కార్యక్రమాలు నిర్వహించినట్టు ఫౌండర్ రవీందర్ నందనూరి తెలిపారు. రెండుసార్లు కశ్మిర్ టూ కన్యాకుమారి సైక్లింగ్ యాత్రను విజయవంతంగా పూర్తి చేసినట్టు వివరించారు. సదరు సైక్లిస్టులను సత్కరించారు. సైక్లింగ్ను ప్రమోట్ చేయాలంటూ బెలూన్స్ను ఎగురవేశారు. సైక్లింగ్పై విధులకు హాజరయ్యే వారిని అభినందించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాదాపూర్ డీసీపీ శిల్పవళ్లి హాజరయ్యారు. సైక్లింగ్ను ప్రాచుర్యంలోకి తీసుకురావడంలో హెచ్సీజీ చాలా కృషి చేస్తుందని అభినందించారు.