బంజారాహిల్స్ : తెలంగాణ జాతిపిత, సీఎం కేసీఆర్ పుట్టిన రోజు వేడుకలను మూడురోజుల పాటు అత్యంత వైభవంగా నిర్వహించిన ప్రజా ప్రతినిధులకు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలుపుతున్నామని హైదరాబాద్ జిల్లా టీఆర్ఎస్ అధ్యక్షుడు, ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అన్నారు.
శుక్రవారం జూబ్లీహిల్స్లోని తన క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మాట్లాడుతూ..తెలంగాణను అభివృద్ది పథంలో తీసుకువెళ్లడంతో పాటు దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా మార్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టిన రోజు సందర్బంగా మూడురోజుల పాటు సేవా కార్యక్రమాలు, హరితహారం కార్యక్రమాలతో సహా విభిన్నరీతిలో వేడుకలను జిల్లా వ్యాప్తంగా నిర్వహించుకున్నామన్నారు.
ఈ కార్యక్రమాలలో పాలు పంచుకున్న వారందరికీ పేరుపేరునా కృతజతలు తెలుపుతున్నామన్నారు. ఇదే స్పూర్తితో భవిష్యత్తులో పార్టీ కార్యక్రమాలన్నింటినీ విజయవంతం చేసుకుందామని సూచించారు.