అమీర్పేట్/బేగంపేట్: నవంబర్ 6: ఎండిపోయిన గడ్డి, చెత్త కాగితాలు, పిచ్చి మొక్కలతో నిండి పోయిన పార్కులు అసాంఘీక కార్యాకలాపాలకు నిలయంగ ఉం డేవి. అలాంటి పార్కులు ప్రస్తుతం పచ్చటి పచ్చిక బయ ళ్లు, ఒపెన్ జిమ్లు, పిల్లలు ఆడుకుకునేందుకు వీలుగా పరికరాలు ఏర్పాటు చేయడంతో పాటు వాకింగ్ ట్రాక్లతో నిత్యం పచ్చదనంతో కళకళలాడుతున్నాయి. సనత్నగర్ నియోజకవర్గంలో సనత్నగర్ డివిజన్ ఇండస్ట్రియల్ సబ్సిడైజ్డ్ హౌసింగ్ కాలనీకి ఓ ప్రత్యేకత ఉంది. 1950 దశకంగా నిర్మితమైన ఈ కాలనీ సనత్నగర్ పారిశ్రామికవాడకు ఆనుకుని ఉంటుంది.
ఈ పారిశ్రామికవాడతో పాటు నగరంలోని ప్రభుత్వ కార్యాలయాల్లో పని చేసే ఉద్యోగులు, కార్మికుల కోసం కేటాయించారు. దాదా పు 1500 క్వార్టర్లు నిర్మించడమే ఒక ప్రత్యేకత అయితే… ఇక్కడి పారిశ్రామిక కాలుష్యాన్ని తట్టకునేందుకు వీలుగా మొత్తం 52 పార్కులతో పాటు ప్లే గ్రౌండ్ల నిర్మాణాలు జరిగాయి. అయితే గత ఆరున్నర దశాబ్దాలుగా పాలకులు ఈ ఉద్యానాలను, ప్లే గ్రౌండ్లను నిర్లక్ష్యం చేస్తూ వచ్చారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తరువాత గత దశాబ్ద కాలంలో ఈ ఉద్యానాలకు ఊ హించని విధంగా ప్రాముఖ్యతనిస్తూ… ని ర్మించిన మల్టీ జనరేషన్ థీమ్ పార్కు ఎస్ఆర్టీ ప్రజల జీవితంలో భాగంగా మారింది.
సనత్నగర్ నియోజకవర్గం పరిధిలో పా ర్కులు సరికొత్త సొబగులు అద్దుకున్నాయి. ఉద్యానాలలో ఓపెస్ జిమ్లు ఏర్పాటు చేయడంలో మంత్రి తలసాని కృషి మరువలేనిది. సనత్నగర్లోని కేఎల్ఎన్ స్మారక పార్కులో యోగా హాలును కూడా నిర్మించి ఇచ్చారు.
తెలంగాణ ప్రభుత్వ ఉద్యాన శాఖ ఆధ్వర్యంలోని ప్రభుత్వ ఉద్యానాల విభాగం 7వ గార్డెన్ ఫెస్టివల్, మొ దటి అర్బన్ ఫామింగ్ ఫెస్టివల్ 2023లో ఉత్తమ ఉద్యాన వనాల ఎంపికలో సనత్నగర్ మోడల్ కాలనీ పార్కుకు మొదటి బహుమతి లభించింది. మోడల్కాలనీ రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఈ పార్కు నిర్వహణకు అధికారులు నుండి మంచి మార్కులు లభించడంతో కాలనీ నివాసితులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
పార్కుల అభివృద్ధికి కృషి చేస్తున్నాం. ప్రజల కోరిక మేరకు అన్ని పార్కులను అభివృద్ధి చేస్తున్నాం. విద్యార్థులు, యువకులకోసం పార్కులలో ఓపెన్జిమ్లను కూడా ఏర్పాటు చేశాం.
– మంత్రి తలసాని