హైదరాబాద్ : బడుగుల జోలికొస్తే బిడ్డా తరిమికొడతాం అని యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు శివ చరణ్ రెడ్డిని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ హెచ్చరించారు. బుధవారం యాదగిరిగుట్ట దేవస్థానం సభ్యురాలు పోచబోయిన ఈశ్వరమ్మ యాదవ్ను ఎల్బీ నగర్లో వారి నివాసానికి వెళ్లి పరామర్శించారు. ఇటీవల శివ చరణ్ రెడ్డి యాదవ సంఘాల నాయకులు, ఈశ్వరమ్మను దుర్భాషలాడుతూ అనుచిత వ్యాఖ్యలు యడంపై ఆగ్రహం వ్యక్తం ఆమెకు సంఘీబావం తెలిపారు.
అగ్రకుల అహంకారంతో నోటికొచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదన్నారు. ఈశ్వరమ్మ ఒంటరిది కాదు..బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు అంతా ఆమె వెంటే ఉన్నారని స్పష్టం చేశారు. బడుగు బలహీన వర్గాలు, అణగారిన వర్గాల జోలికి వస్తే మా తడాఖా ఏంటో చూపిస్తాం. అన్ని వర్గాల ప్రజలకు సేవలు అందిస్తూ అనేకమంది మన్ననలు పొందిన ఈశ్వరమ్మను ఆమె వయసును చూడకుండా దుర్భాషలాడటం అహంకారం కాదా? అని నిలదీశారు.