శంకర్పల్లి, ఏప్రిల్ 6 : మఖ్యమంత్రి సహాయ నిధి పేదలకు వరమని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. మంగళవారం శంకర్పల్లి పరిషత్ కార్యాలయం ఆవరణలో మండలంలోని 20 మంది లబ్ధిదారులకు రూ.7,52,500 చెక్కులు అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు సీఎం చేయూతనిస్తున్నారని కొనియాడారు. కార్యక్రమంలో ఎంపీపీ గోవర్ధన్రెడ్డి, టీఆర్ఎస్ మండల మాజీ అధ్యక్షుడు వెంకట్రెడ్డి, ప్రధాన కార్యదర్శి వాసుదేవ్కన్నా, గోపులారం సర్పంచ్ శ్రీనివాస్, కౌన్సిలర్ శ్రీనాథ్, తహసీల్దార్ కృష్ణకుమార్, ఎంపీడీవో సత్తయ్య పాల్గొన్నారు.
ఎల్వోసీ అందజేత
మండల పరిధిలోని పంజర్లకు చెందిన యాదమ్మకు రూ.4 లక్షల ఎల్వోసీని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ మంగళవారం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేదలందరికీ నాణ్యమైన వైద్యం అందించాలనేది సీఎం కేసీఆర్ లక్ష్యం అన్నారు. కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ గణేశ్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు యాదగిరి, షాద్నగర్ ఏఎంసీ డైరెక్టర్ భీమయ్య, గ్రామ కమిటీ అధ్యక్షుడు రాజు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే పరామర్శ..
టీఆర్ఎస్ నాయకుడు, ఎంపీటీసీల ఫోరం మండలాధ్యక్షుడు శ్రీనివాస్కు పితృవియోగం జరిగింది. చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య శంకరయ్య మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. ఎంపీపీ నక్షత్రం, జడ్పీటీసీ కాలె శ్రీకాంత్, మాజీ జడ్పీటీసీ అనంతరెడ్డితో పాటు ఎంపీటీసీలు, సర్పంచ్లు, టీఆర్ఎస్ నాయకులు, పార్టీల నాయకులు సంతాపం వ్యక్తం చేశారు.