సిటీబ్యూరో, మే 6 (నమస్తే తెలంగాణ): గ్రేటర్లో ద్రోణి ప్రభావంతో ఉష్ణోగ్రతలు కొంత మేర తగ్గుముఖం పట్టాయి. బుధవారం ఉదయం నుంచి రాత్రి వరకు నగరంలో గరిష్ట ఉష్ణోగ్రతలు 36.5డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రతలు 25.6డిగ్రీలు, గాలిలో తేమ 39శాతంగా నమోదైనట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. ద్రోణి ప్రభావంతో గ్రేటర్లో రాగల రెండురోజులు కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, మరికొన్ని చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణకేంద్రం అధికారులు తెలిపారు.