సిటీబ్యూరో, జూన్ 22 (నమస్తే తెలంగాణ): రుతుపవనాల ప్రభావంతో గ్రేటర్లో ఉష్ణోగ్రతలు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. మరో పక్క పగలు సమయంలో మబ్బులు కమ్ముకున్నప్పటికీ ఉక్కపోత ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. సోమవారం ఉదయం నుంచి రాత్రి వరకు నగరంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 36.3డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రతలు 27.0డిగ్రీలు, గాలిలో తేమ 58శాతంగా నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. ఇదిలా ఉండగా రాగల రెండు రోజులు నగరంలోని పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వాన కురిసే అవకాశాలున్నట్లు అధికారులు తెలిపారు.