Hyderabad | సిటీబ్యూరో, మార్చి 24 (నమస్తే తెలంగాణ) : దక్షిణ దిశ నుంచి తెలంగాణ వైపునకు వీస్తున్న కిందిస్థాయి గాలుల ప్రభావంతో గ్రేటర్లో ఎండలు దంచికొడుతున్నాయి. పగటి ఉష్ణోగ్రతలతో పాటు రాత్రి ఉష్ణోగ్రతలు సైతం సాధారణ స్థాయి కంటే ఎక్కువగా నమోదవుతుండడంతో ఉక్కపోత ఉక్కిరిబిక్కిరి చేస్తున్నది.
ఆదివారం ఉదయం నుంచి రాత్రి వరకు నగరంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 37.2డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రతలు 26.7డిగ్రీలు, గాలిలో తేమ 26శాతంగా నమోదైనట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు.