సిటీబ్యూరో, ఏప్రిల్ 14 (నమస్తే తెలంగాణ): గ్రేటర్లో ఉష్ణోగ్రతలు ఠారెత్తిస్తున్నాయి. పగటి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటి నమోదవుతుండడంతో మధ్యాహ్నం సమయంలో జనం బయటకు రావడానికి జంకుతున్నారు.
మంగళవారం ఉదయం నుంచి రాత్రి వరకు నగరంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 40.1 డిగ్రీల సెల్సియస్, కనిష్ఠ ఉష్ణోగ్రతలు 28.4 డిగ్రీల సెల్సియస్, గాలిలో తేమ 50 శాతంగా నమోదైనట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు.