రామంతాపూర్, డిసెంబర్ 2 : శృంగేరి శారదాపీఠంలో శ్రీశ్రీశ్రీ విధుశేఖర భారతీ మహాస్వామి సన్నిధానంలో శుక్రవారం తెలంగాణ విద్వత్ సభ సమ్మేళనం జరిగింది. వేద , జ్యోతిష్య పండితులు, సిద్ధాంతులు పలువురు హాజరై తమ అభిప్రాయాలు, అనుమానాలను స్వామి వారికి వివరించారు. స్వామి వారి నుద్దేశించి అనుగ్రహ భాషణం చేస్తూ పండుగల నిర్ణయం పై వ్యత్యాసం ఏర్పడినప్పుడు ధర్మశాస్ర్తాలు అనుసరించి సరైన ప్రామాణికంతో ఆయా ప్రాంతాలను అనుసరించి తుది నిర్ణయం తీసుకోవాలని సూచించినట్లు విద్వత్ సభ ప్రధాన కార్యదర్శి దివ్యజ్ఞాన సిద్ధాంతి, కోశాధికారి దర్శనం వెంకటరమణ శర్మ తెలిపారు.
భవిష్యత్తులో తెలంగాణ విద్వత్ సభలు శృంగేరిలో జరుపుకొనేందుకు సన్నిధానం వారు అనుమతి ఇచ్చారన్నారు. ఈ కార్యక్రమంలో వ్యాసోజ్జుల రాధాకృష్ణశర్మ, సమన్వయ కర్త భీమ్సేన్ మూర్తి, గాడిచర్ల నాగేశ్వర సిద్ధాంతి, బోర్పట్ల హనుమంతాచార్యులు, నరేశ్ కులకర్ణి, శాస్త్రుల వెంకటేశ్వరశర్మ, నటరాజశర్మ,ప్రశాంత్జ్యోషి, భాస్కరచార్య, ఆదరాజుపల్లి శ్యాంమోహన్ శర్మ నాగరాజ శర్మ, లక్ష్మీవెంకటేశ్వర సిద్ధాంతి, గుణవంతరావు, రామకృష్ణశర్మ, శివశర్మ, జగన్మోహన శర్మ, సీతారామశర్మ, రఘురామశర్మ, శ్రీనివాస్శర్మ, సదాశివశర్మ, ముద్దు రాజన్న సిద్ధాంతి, శాస్ర్తుల కృష్ణమూర్తిశర్మ, సత్యం శ్రీసన్నిధి తదితరులు పాల్గొన్నారు.