శామీర్పేట, నవంబర్ 22: తెలంగాణ ప్రభుత్వం గత తొమ్మిదేండ్లలో రాష్ట్ర సంపదను పెంచి పేద ప్రజలకు సంక్షేమ పథకాల రూపంలో పంచిందని, ఆ ఘనత సీఎం కేసీఆర్కే దక్కిందనని మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శామీర్పేట మండలంలోని అలియాబాద్, లాల్గడి మలక్పేట, మజీద్పూర్, యాడారం, బాబాగూడ, పొన్నాల్, తుర్కపల్లి, మురహార్పల్లి, మూడుచింతలపల్లిలోని కొల్తూర్ గ్రామా ల్లో బుధవారం మంత్రి రోడ్ షో కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే లక్ష్యంగా సీఎ కేసీఆర్ చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయన్నారు. దేశ చరిత్రలో ఏ ప్రభు త్వం, ఏ పార్టీ చేయని విధంగా ఆసరా పింఛన్ కల్యాణలక్ష్మి, భగీరథ నీరు, నిరంతర విద్యుత్, రైతుబంధు, రైతుబీమా, దళితబంధు, బీసీబంధు వంటి మహత్తర పథకాలు ప్రజలకు అందజేసిందన్నారు.దళితుల కోసం దళితబంధు పథకంలో కుటుంబానికి రూ.10 లక్షల ఆర్థిక సాయం చేసిందన్నారు. కులవృత్తులను ప్రోత్సహించేందుకు రూ.1లక్ష బీసీబంధును ఇచ్చిందన్నారు.
కానీ బీజేపీ,కాంగ్రెస్ పార్టీలు ప్రజలకు చేసిందేమి లేదని ఎద్దేవా చేశారు. ఒకడు మూడు గంటల కరెంటు ఇస్తానని రైతాంగాన్ని దెబ్బతీసే పనిలో ఉంటే సిలిండర్ను రూ.1200 లకు పెంచి బీజేపీ ప్రభుత్వం పొయ్యిమీద కుండెక్కకుండా చేస్తుందన్నారు. కానీసీఎం కేసీఆర్ ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేస్తూ ఎన్నికల మేనిఫెస్టోలో రూ.400 లకు సిలిండర్తో పాటు ప్రతి మహిళకు రూ.3వేలు, పింఛన్ నెలకు రూ.5 వేలకు పెంచనున్నట్లు తెలిపారు. ప్రజా సంక్షేమం కోసం పని చేస్తున్న తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని గుర్తించి బీఆర్ఎస్ పార్టీని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ఎంపీపీ ఎల్లూభాయిబాబు, జడ్పీటీసీ అనితలాలయ్య, డీసీఎంఎస్ వైస్ చైర్మన్ మధుకర్రెడ్డి, వైస్ ఎంపీపీ సుజాత, సర్పంచ్లు కుమార్యాదవ్, వనజశ్రీనివాస్రెడ్డి, మోహన్రెడ్డి, సుజాత, భాస్కర్, లతరవీందర్, గీతమహేందర్, ఎంపీటీసీలు శ్రీనివాస్యాదవ్, అశోక్, ఇందిరా రాజిరెడ్డి, మౌనిక వీర ప్రసాద్, బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి మహేందర్రెడ్డి, మండల అధ్యక్షులు సుదర్శ న్, మల్లేశ్గౌడ్, ప్రధాన కార్యదర్శులు సతీష్రెడ్డి, అనిల్రెడ్డి, యూత్ అధ్యక్షుడు నర్సింహారెడ్డి,నిరజ్గౌడ్, సంతోష్రెడ్డి, డైరెక్టర్లు హనుమాన్దాస్, మాధవి, గ్రామాల అధ్యక్షులు శ్రీనివాస్గౌడ్, శ్రీకాంత్గౌడ్, రవి, వెంకటేశ్, ప్రభాకర్, రమేశ్, జగదీశ్గౌడ్, శ్రీనివాస్, ఫణిరాజ్, యా దగిరి, నందుగౌడ్, మన్ముచారి, రవికిరణ్రెడ్డి, భరత్, బాలే ష్,ప్రకాశ్,వార్డు సభ్యులు,పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.
జనసంద్రమైన పల్లెలు..
ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉమ్మడి శామీర్పేట మండలంలో మంత్రి మల్లారెడ్డి నిర్వహించిన రోడ్ షోకు ప్రజలు, అభిమానులు భారీగా తరలివచ్చారు. అలియాబాద్ మొదలుకుని యాడారం వరకు, బాబాగూడ మొదలుకుని మురహార్పల్లి వరకు గులాబీ వనమైన జనసంద్రంగా మారింది. మహిళలు, మైనార్టీ సోదరులు స్వచ్ఛందంగా రోడ్ షోలో పాల్గొన్నారు. జే బీఆర్ఎస్, జే మల్లన్న అంటు నినాదాలతో హోరెత్తించారు. ఇప్పటికే నియోజకవర్గంలో 125 ఆలయాలు కట్టించడంతో పాటు గ్రామ గ్రామాన అవసరం ఉన్న ప్రతి చోట తన స్వంత నిధులతో సీసీ రోడ్లు వేశానని గుర్తు చేశారు. బాబాగూడను బంగా రం చేస్తానని, మజీద్పూర్లోని ఎస్సీ, ఎస్టీ, బీసీ రైతులకు భూ సమస్యను తానే స్వయంగా పరిష్కరిస్తాని భరోసా ఇచ్చారు. దత్తత గ్రామం యాడారంను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానన్నారు.