Telangana Police | తెలంగాణ పోలీస్ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. రిటైర్మెంట్ అయిన డీజీపీలను కొందరిని ప్రభుత్వం వివిధ పదవులలో కొనసాగిస్తున్న నేపథ్యంలో.. పదవుల్లో ఉన్నవారికి ప్రస్తుతం కొనసాగిస్తున్న బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. 26 మంది మాజీ పోలీస్ ఉన్నతాధికారులతోపాటు ప్రస్తుత అధికారులకు బుల్లెట్ వాహనాలు తీసివేసింది.
మాజీ డీజీపీలు స్వరణ్జిత్ సేన్, ఏకే ఖాన్, ఏకే మహంతి, దినేష్ రెడ్డి, జితేందర్, మహేందర్ రెడ్డి, అనురాగ్ శర్మ, పూర్ణచందర్రావు, కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి, నవీన్ ఛంద్, డానియల్, వెంకట్రామిరెడ్డి, స్టీఫెన్ రవీంద్ర, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. డీటీ నాయక్, ఉమేష్ షరీఫ్, రవి గుప్తా, ఇంటెలిజెన్స్ చీఫ్ విజయకుమార్, హైదరాబాద్ పోలీస్ కమిషనర్లకు బుల్లెట్ ప్రూఫ్ వాహనాలను పోలీస్ శాఖ తీసివేసింది.
మాజీ డీజీపీలకు ఉన్న ఎస్కార్ట్ వాహనాలను సైతం తీసివేసింది. పలువురు రాజకీయ నేతలతోపాటు పోలీసు అధికారులకు ఉన్న గన్ మెన్ల సంఖ్య తగ్గించిన పోలీస్ శాఖ చాలావరకు వన్ ప్లస్ వన్ గన్ మెన్లకే పరిమితం చేసింది.