కేపీహెచ్బీ కాలనీ, మార్చి 6: జేఎన్టీయూహెచ్లో ఏపీటీఐ తెలంగాణ ఉమెన్స్ ఫోరం ఆధ్వర్యంలో నిర్వహించిన తెలంగాణ ఫార్మా ఉత్సవ్ 2కే-23 వేడుకలు సోమవారం సందడిగా జరిగాయి. వర్సిటీలోని సెంటర్ ఫర్ ఫార్మాస్యూటికల్స్ సైన్సెస్ విభాగం ఆవరణలో జరిగిన ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా వర్సిటీ రిజిస్ట్రార్ మంజూర్ హుస్సేన్, కళాశాల ప్రిన్సిపాల్ ఎ.జయలక్ష్మి, ఏపీటీఐ టీఎస్ ప్రెసిడెంట్ చిన్నల కృష్ణమోహన్, అడ్వైజర్ ఎం.సునీతారెడ్డి, జాయింట్ సెక్రటరీ ఎస్.శోభారాణి, ఉమెన్స్ ఫోరం కన్వీనర్స్ ఎస్.సునీత, కె.వనిత హాజరయ్యారు.
మహిళా దినోత్సవం సందర్భంగా ఏపీటీఐ ఆధ్వర్యంలో విద్యార్థునులకు క్రీడలు (బ్యాడ్మింటన్, చెస్), సాంస్కృతిక (గానం, ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్, లఘు కవిత్వం, రోల్ ప్లే), శాస్త్రీయ (పిచియాన్, ఐడియా, ఎలక్ట్యూటిషయన్), డిజిటెక్ (ఏపీటీయై లోగో, వీడియో మేకింగ్) అంశాలపై నిర్వహించిన తుది పోటీల్లో విజేతలకు బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మహిళలు ఆత్మ విశ్వాసంతో పాటు నైపుణ్యాలను పెంపొందించుకుని ఉన్నత అవకాశాలను పొందాలని సూచించారు.ఈ వేడుకల్లో విద్యార్థినులు ఆటపాటలతో సందడి చేశారు.