మేడ్చల్ కలెక్టరేట్, డిసెంబర్ 19 : మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ 2022-23 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రంలోని ముస్లిం, సిక్కులు, పార్సీలు, బౌద్ధులు, జైనులకు సబ్సిడీతో కూడిన ఆర్థిక సహాయం అందిస్తున్నదని జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ అధికారి కె.నవీన్ కుమార్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. వ్యాపార యూనిట్లు (చిన్న యూనిట్లు), వివిధ అనుబంధ వ్యాపారాల ఏర్పాటుకు అర్హులైన, ఆసక్తిగల మైనార్టీలు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఇతర వివరాలకు 9000168256, 9492037940 సంప్రదించాలని కోరారు.
హైదరాబాద్ జిల్లాలో కూడా..
హైదరాబాద్ జిల్లాలోని మైనారిటీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సబ్సిడీ రుణాలు ఇచ్చేందుకు దరఖాస్తులు కోరుతున్నారు. ఈ మేరకు మైనారిటీలు దరఖాస్తులు చేసుకోవడానికి ముస్లిం, సిక్కు, పార్సీ, బౌద్ధులు, జైనులకు సబ్సిడీ ద్వారా ఆర్థిక సహాయం అందించనున్నట్లు జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ అధికారులు తెలిపారు. ఈ మేరకు దరఖాస్తుల ప్రక్రియ సోమవారం నుంచి ప్రారంభమైందన్నారు. దరఖాస్తులు చేసుకోవడానికి జనవరి 5 వరకు గడువు విధించినట్లు తెలిపారు. ఆన్లైన్ దరఖాస్తులు, ఇతర వివరాల కోసం httjp://tsobmms. cgg.gov.in వెబ్సైట్ను సంప్రదించాలన్నారు.