కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి
నాగారం, దమ్మాయిగూడ మున్సిపాలిటీల్లో పలు అభివృద్ధి పనులు ప్రారంభం..
మేడ్చల్ కలెక్టరేట్, ఏప్రిల్ 3 : అభివృద్ధి, సంక్షేమంలో ఇతర రాష్ర్టాలకు తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా నిలుస్తున్నదని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. దమ్మాయిగూడ , నాగారం మున్సిపాలిటీలో రూ.కోటి 52 లక్షలతో చేపట్టిన పలు అభివృద్ధి పనులను మంత్రి ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని తెలిపారు. గ్రామా లు, పట్టణాల్లో ప్రజలకు మౌలిక వసతులు ఏర్పాటు చేస్తున్నారని చెప్పారు. ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవిస్తే.. కేసీఆర్ కిట్ మొదలు కొని కల్యాణలక్ష్మి పథకం ద్వారా పేదలకు అండగా నిలిచారని పేర్కొన్నారు. రాష్ట్రం ఏర్పడిన తరువాత సీఎం కేసీఆర్ అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్త్తూ, అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని తెలిపారు. 60 ఏండ్లలో జరుగని అభివృద్ధిని 7 ఏండ్లలో సీఎం కేసీఆర్ చేసి చూపించారని చెప్పారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్లు కౌకుట్ల చంద్రారెడ్డి, ప్రణీత శ్రీకాంత్గౌడ్, కమిషనర్లు ఎ.వాణిరెడ్డి, స్వామి, వైస్ చైర్మన్లు మల్లేశ్, నరేందర్ రెడ్డి, కౌన్సిలర్లు, కో-ఆప్షన్ సభ్యులు, అధికారులు, నాయకులు పాల్గొన్నారు.
క్రీడల్లో రాణించాలి : మంత్రి
కీసర : తెలంగాణ ప్రభుత్వం క్రీడాకారులకు తగిన ప్రాధాన్యత కల్పిస్తున్నదని కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి తెలిపారు. నాగారం, దమ్మాయిగూడ మున్సిపాలిటీ క్రీడాకారులకు రాంపల్లిదాయరలోని క్రికెట్ గ్రౌండ్లో ఇంటర్ కాలనీ క్రికెట్ చాంపియన్ షిప్ 120 పేరిట క్రికెట్ పోటీలు నిర్వహించారు. ఆదివారం మంత్రి మల్లారెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై విజేతలకు షీల్డులు, బహుమతులను ప్రదానం చేశారు. యువతలో క్రీడలు చాలా ప్రధాన భూమిక పోషిస్తాయని, క్రీడలు శారీరక మానసిక ఉల్లాసానికి ఎంతగానో దోహదం చేస్తాయని మంత్రి తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీ ఇందిర లక్ష్మీనారాయణ, రాంపల్లిదాయర ఇన్చార్జి సర్పంచ్ శ్రీకాంత్రెడ్డి, దమ్మాయిగూడ చైర్మన్ ప్రణీత, వైస్ చైర్మన్ నరేందర్రెడ్డి, పలువురు కౌన్సిలర్లు, టీఆర్ఎస్ నేతలు పాల్గొన్నారు.
మంత్రి ప్రారంభించిన అభివృద్ధి పనులివే..
దమ్మాయిగూడ మున్సిపాలిటీలో..