Minister Mallareddy | ఘట్కేసర్ రూరల్, జూలై 6: అభివృద్ధిలో తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నదని మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. మండల పరిధి అవుషాపూర్, అంకుషాపూర్, ఏదులాబాద్ గ్రామాల్లో రూ. 30 లక్షలతో చేపట్టిన అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు,సీసీ రోడ్లు నిర్మాణాలకు గురువారం మంత్రి శంకుస్థాపన చేశారు.అనంతరం మంత్రి మట్లాడుతూ సీఎం కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుతో రాష్ట్రం లో అనేక విప్లవాత్మక మార్పులు వచ్చాయని, అన్ని వర్గాల వారికి ప్రభుత్వ ఫలాలు దక్కినట్లు చెప్పారు. రాష్ర్టాన్ని దేశానికే అన్నపూర్ణగా మార్చినట్లు చెప్పారు. పండిన ప్రతి గింజను గిట్టుబాటు ధరకే కొనుగోలు చేయడం తెలంగాణ రాష్ర్టానికే సాధ్యమైందన్నారు.
సీఎం కేసీఆర్కు ప్రతి ఒక్కరు అండగా నిలువాలన్నారు. అవుషాపూర్, అంకుషాపూర్, ఏదులాబాద్, ఘనపూర్ గ్రామాలో బాబు జగ్జీవన్రామ్ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహాలకు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ జడ్పీ చైర్మన్ శరత్ చంద్రారెడ్డి, వైస్ చైర్మన్ వెంకటేశం, జిల్లా గ్రంథాలయ చైర్మన్ దయాకర్ రెడ్డి, మాజీ ఎంపీపీ బండారి శ్రీనివాస్ గౌడ్, మండల సర్పంచ్ల సంఘం అధ్యక్షుడు వెంకటేశ్ గౌడ్ సర్పంచ్లు కావేరి, జలజ, సురేశ్, ఉప సర్పంచ్లు ఐలయ్య యాద వ్, బాలమణి, లింగేశ్వర్ రావు, పంచాయతీ సభ్యులు, బీఆర్ఎస్ మండల శాఖ అధ్యక్షుడు రమేశ్, ప్రధాన కార్యదర్శి కొండల్ రెడ్డి, మండల నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.