ఎర్రగడ్డ : మహిళా సంక్షేమానికి పాటు పడుతున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ (MLA Gopinath ) అన్నారు. మహిళల అభ్యున్నతికి సీఎం కేసీఆర్ (CM KCR) సర్కారు పెద్ద పీట వేస్తుందని పేర్కొన్నారు. బోరబండ డివిజన్కు చెందిన 19 మంది లబ్దిదారులకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల (Checks)ను బుధవారం పంపిణీ చేశారు.
ఆయన మాట్లాడుతూ దేశంలో ఎక్కడ లేని విధంగా కల్యాణలక్ష్మి (Kalyanalaxmi), షాదీ ముబారక్, కేసీఆర్ కిట్స్ వంటి పథకాలను ముందుకు తీసుకెళ్తున్న ఘనత కేసీఆర్దేనని వెల్లడించారు. పేదింటి ఆడపిల్ల పెళ్లికి రూపాయి అప్పు చేయకుండా ఆదుకుంటూ కేసీఆర్ పెద్దన్న పాత్రను పోషిస్తున్నారన్నారు.
మహిళా సాధికారత, ఆర్థిక స్వావలంబన కోసం కృషి చేస్తున్న కేసీఆర్ మహిళా బంధుగా పేరు తెచ్చుకున్నారని పేర్కొన్నారు. అంతే కాకుండా పేద కుటుంబాలకు ఉచితంగా డబుల్ బెడ్ రూం ఇండ్లను అందిస్తున్న కేసీఆర్ ప్రభంజనాన్ని విపక్షాలు అడ్డుకోలేవన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు కృష్ణమోహన్, విజయకుమార్, కోఆర్డినేటర్ విజయసింహ, ఇన్చార్జి సిరాజ్, రామకృష్ణ, ఖలీల్, వెంకటేష్, దేవమణి, సూర్యకళ, బాబానాయక్, రమేష్, ధర్మ, యూసుఫ్, షరీఫ్, సాయిచరణ్, అబ్బు, వంశీ తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యేకు సన్మానం
నియోజకవర్గానికి చెందిన 500 పేద కుటుంబాలకు ఇటీవల డబుల్ బెడ్ రూం ఇండ్ల కేటాయించడంతో బోరబండ డివిజన్కు చెందిన లబ్దిదారులు ఎమ్మెల్యే గోపీనాథ్ను సన్మానించారు. అనేక సంవత్సరాలుగా కిరాయి ఇండ్లల్లో ఉంటూ కష్టాలు పడ్డ తమను డబుల్ బెడ్రూం ఇండ్లను ఉచితంగా అందజేసిన కేసీఆర్కు, సహకరించిన ఎమ్మెల్యేకు రుణపడి ఉంటామని పేర్కొన్నారు.