సిటీబ్యూరో, మే 14 (నమస్తే తెలంగాణ): జీహెచ్ఎంసీ పరిధిలో కొత్త బార్లకు దరఖాస్తులు ఆహ్వానిస్తూ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. జీహెచ్ఎంసీ పరిధిలో 24 బార్లు, రంగారెడ్డి జిల్లా జల్పల్లి మున్సిపాలిటీ పరిధిలో ఒక బార్కు నోటిఫికేషన్ ఇచ్చారు.
జిహెచ్ఎంసి పరిధిలోని బార్లకు బెట్ స్లాబ్ ఫీజు రూ.40లక్షలు, జల్పల్లి మున్సిపాలిటీ పరిధిలో రూ.42లక్షలుగా నిర్ణయించినట్లు ఆబ్కారీ అధికారులు తెలిపారు. ఈ ఫీజు తిరిగి చెల్లించరని, 2బీ బార్లకు ఒక వ్యక్తి ఎన్ని దరఖాస్తులైనా చేసుకోవచ్చని వెల్లడించారు. ఈనెల 15 నుంచి జాన్ 6లోపు దరఖాస్తులను స్వీకరిస్తామని ఆబ్కారీ అధికారులు తెలిపారు.